08-06-2025 12:32:15 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya) 'ఆటో బయోగ్రఫీ' పుస్తకావిష్కరణ(Autobiography Book) జరిగింది. 'ప్రజల కథే నా ఆత్మకథ'(Prajale Na Athmakatha)ను ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Former President Ram Nath Kovind) ఆవిష్కారించారు. పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ తో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, కేకే, ఏపీ సీఎం, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు హాజరయ్యారు.