calender_icon.png 8 June, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మాగంటి భౌతికకాయానికి కేసీఆర్ కన్నీటి నివాళి

08-06-2025 01:38:49 PM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆదివారం ఉదయం మరణించిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. మాదాపూర్‌లోని డాక్టర్స్ కాలనీలో గోపీనాథ్ నివాసాన్ని వెళ్లిన కేసీఆర్, గోపీనాథ్ మృతదేహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తరువాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూలి తెలియజేశారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు.