calender_icon.png 8 June, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత

08-06-2025 03:08:25 PM

హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) పార్థివ దేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) నివాళులర్పించారు. గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్ మరణంపై కవిత మాట్లాడుతూ... మాగంటి దురదృష్టవశాత్తూ మరణం చాలా బాధాకరమని,  బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఆయన కుటుంబానికి అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తలను అణచివేసి, వారిపై తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి తాము కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నామని, తమ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని కవిత చెప్పారు.