calender_icon.png 8 June, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాలి: సీఎం రేవంత్

08-06-2025 02:55:43 PM

హైదరాబాద్: 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రాఫీ పుస్తకావిష్కరణ(Autobiography Book) ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలతో ఉన్న ఆయన అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని పేర్కొన్నారు. గౌలిగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్ గా ఆయన ఎదిగారని సీఎం గుర్తు చేశారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను చూశారని, ఏరోజూ కూడా దత్తాత్రేయ ప్రజలతో ఉన్న సంబంధాలను కోల్పోలేదన్నారు.

దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో తనకు సన్నిహిత సంబధాలున్నాయని రేవంత్ చెప్పారు. ఒక్కసారి కార్పొరేటర్ అయితేనే జీవనశైలి మారుతోందని, కానీ ఎంత ఎత్తుకు ఎదిగిన తన శైలి మారాలేదని, దత్తాత్రేయను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. జాతీయస్థాయిలో వాజ్ పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందన్నారు. ఎన్నికల్లో ఓడినా ఎప్పుడు వాజ్ పేయీ గౌరవం తగ్గలేదని, దత్తాత్రేయ ఆటో బయోగ్రాఫీ పుస్తకావిష్కరణ వేదిక గవర్నర్ల పరేడ్ మాదిరిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పీ. జనార్థన్ రెడ్డి, దత్తాత్రేయ పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.