calender_icon.png 8 June, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా సాగుతున్న బడిబాట

08-06-2025 01:21:15 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు జట్టుగా ఏర్పడి ఇల్లు తిరుగుతూ బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు తమ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. అలాగే ఆయా పాఠశాలల్లో చదువుకొని, అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఫోటో ముద్రించిన ప్రచార కరపత్రాలను ఇంటింటికి పంచుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్యా బోధన చేయడంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, కార్పొరేట్ స్థాయిలో నూతనంగా ప్రవేశపెట్టిన అధునాతన డిజిటల్ విద్యాబోధన  చేస్తున్నామని, ప్రైవేటు పాఠశాలల్లో చర్చించి వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ బడిలో చేర్పించాలంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లో ఉపాధ్యాయులు మహమ్మద్ వహీద్, వెంపటి విజయరాజ్, ముత్యాల శ్రీధర్, దైద వెంకటేశ్వర్లు, బొందిలి వెంకన్న, బేత మల్ల ప్రేమ్ సాగర్, బండి రవీందర్, తాళ్లపల్లి యాకమ్మ, ఉప్పలయ్య, ఉమేశ్వర్ ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో కూడిన ప్రచార పత్రాలను ఇంటింటికీ పంచుతున్నారు.