calender_icon.png 20 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఐడీ విచారణకు హాజరైన నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి

21-11-2025 02:52:02 PM

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం(Online betting app case) కేసులో సీఐడీ పలువురిని విచారిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో అమృతచౌదరి, శ్రీముఖి, నిధి అగర్వాల్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో నటుడు రానా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను పిలిచి విచారించిన సీఐడీ స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.