14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ఉగ్రవాదుల దాడి.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే

01-05-2025 01:05 AM

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత కంది ఉగ్రదాడిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం

ఆదిలాబాద్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): ఉగ్రవాదుల దాడి వెనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఇటీవల పహ ల్గాంలో జరిగిన ఉగ్రదాడి నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధ వారం నిరసన తెలిపారు.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.  అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ నా యకులు పాకిస్తాన్ వెళ్లాలి అన్న ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి తప్పు బట్టారు.

ఉగ్రవాదానికి బలైంది తమ కాంగ్రెస్ పార్టీ అని ఇద్దరు కాం గ్రెస్ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ రాజీ వ్ గాంధీని పొట్టన బెట్టుకున్నది ఉగ్రవాదం కాదా అని గుర్తు చేసారు. ఇతర పార్టీని విమర్శించే ముందు ఒకసారి చరిత్ర తెలుసుకో వాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.  పహల్గాంఉగ్రదాడిలో ప్రాణాలుకోల్పోయిన వారికి నివాళ్లు అర్పిస్తున్నామన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి ఆయన తెలిపారు.