4 July, 2026 | 11:39 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మల్లికార్జున, బీరప్ప ఉత్సవాలకు ఏర్పాట్లు

01-05-2025 01:04 AM

చేవెళ్ల , ఏప్రిల్ 30 : చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులో ఈనెల (మే) 4,5వ తేదీల్లో నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి, బీరప్ప జాతర  ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్, హైదరాబాద్  బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి తెలిపారు. బుధవారం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై గ్రామస్తులతో కలిసి మాట్లాడి, ఆలయం వరకు ఉన్న రోడ్డులో చెత్త, పిచ్చి మొక్కలను తొలగింపజేశారు.

ఈ సందర్భంగా సామ మాణిక్యరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 11 సంవత్సరాలకు ఒక సారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జేసీబీతో రోడ్డును చదును చేయించి పిచ్చి మొక్కలను తొలగించిన దాత విజయ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నేతలు ఎదిరె శ్రీశైలం, ఎదిరె బక్కయ్య, అంగరెల్లి రాజు, ఎదిరె యాదయ్య, కరికె విఠలయ్య పాల్గొన్నారు