16 April, 2026 | 6:11 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బాణావత్ రాములు చికిత్సకు ఎన్‌ఓసీ అందజేత

16-05-2025 12:39 AM

నిజామాబాద్, మే 15 (విజయ క్రాంతి) : నిజామాబాదు రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని వెంకట్రామ్ తండాకు చెందిన అమరాబాదు బాణావత్ రాములు తలకు తీవ్ర గాయం కావడంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎన్వోసీ అందజేశారు.

చికిత్స కోసం వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో వారిని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సకు అవసరమయ్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు ఇప్పించడానికి ఎల్‌ఓసి లేఖను ఎమ్మెల్యే భూపతిరెడ్డి వారికి అందజేశారు. తమకు సహకరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బాణావత్ రాములు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.