29-01-2026 12:00:00 AM
కలెక్టర్ పమేలా సత్పతి
హూజురాబాద్, జనవరి 28 (విజయ క్రాంతి): ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహ రించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కలెక్టర్ వెంట జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఉన్నారు.