27-11-2025 06:50:59 PM
ఎంపీడీవో సురేష్..
ముత్తారం (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముత్తారం మండలంలో గురువారం మండలంలోని 14 గ్రామపంచాయతీలో సర్పంచ్ లకు 8 నామినేషన్ లు వచ్చినట్లు ఎంపీడీఓ సురేష్ తెలిపారు. ఖమ్మంపల్లిలో (02) ఇప్పలపల్లి లో( 01) సీతంపేటలో (01) హరిపురంలో )01) ఓడేడిలో (03) నామినేషన్లు స్వీకరించామని, అలాగే శుక్రవారం శనివారం కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని ఎంపీడీవో తెలిపారు. మైదంబండలో ఎంపీడీవో అధికారులతో పర్యటించి నామినేషన్ల స్వీకరణను పరిశీలించారు. ఏమైనా అనుమానాలు ఉంటే తనకు ఫోన్ చేయాలని ఎంపీడీఓ ప్రజా ప్రతినిధులకు సూచించారు.