09-06-2025 01:49:19 AM
ఆపై యజమానులతో ‘టౌన్ ప్లానింగ్’ కుమ్మక్కు
కూల్చివేస్తామంటూ అధికారుల బీరాలు
రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరే వేరు
భారీగా వసూళ్లపర్వం
రాజేంద్రనగర్, జూన్ 8: సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది. అక్రమ నిర్మా ణదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నా అడిగే వారు కరువ య్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ చర్య లు తీసుకుంటూ ఉక్కుపాదం మోపాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతూ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
టౌన్ ప్లానింగ్ రూటే.. సెపరేటు
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులకు వత్తాసు ప లుకుతూ నిర్మాణదారుల నుంచి లక్షల్లో వ సూలు చేస్తున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నా యి. అనుమతులు లేకుం డా నిర్మాణాలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల అత్తాపూర్ డివిజన్ పరిధిలోని న లంద నగర్ లో అనుమతులు లేకుండా షట్ట ర్ల నిర్మాణం చేపట్టారు.
ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల దృ ష్టికి వెళ్ళింది. అనంతరం నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. వెంటనే అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తామని బీరాలు పలికిన టౌన్ ప్లానింగ్ ఏసీపి శ్రీధర్ ఆపై పట్టించుకోవడం లేదు. నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారు.
అనుమతులు లేకుండా భారీ ఫంక్షన్ హాల్..
రాజేంద్రనగర్ లో టౌన్ ప్లానింగ్ విభాగంలో నోటీసులు.. సెటిల్మెంట్లు అనే విధం గా సాగుతుంది. ఆరాంఘర్ చౌరస్తాకు ఆనుకొని అనుమతి లేకుండా కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి భారీ ఫంక్షన్ హాల్ నిర్మించా డు. ఈ విషయమై మీడియాలో రావడంతో నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చారు. కొన్ని రోజులు పనులు ఆగాయి. ఏం జరిగిందో ఏమో కానీ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా పూ ర్తి కావడం గమనార్హం.
ఈ వ్యవహారంలో భారీ మొత్తం చేతులు మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మించిన ఫంక్షన్ హాల్ ను కూల్చివేయాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారితో రాజీ కుదుర్చుకున్నారని సమాచారం. అదేవిధంగా శివరాంపల్లి లో పిల్లర్ నెంబర్ 171 సమీపంలో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని ఓ వ్యక్తి దర్జాగా షోరూం నిర్మాణం చేప ట్టాడు.
ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారులు నామ మాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపేసుకున్నారు. నిర్మాణం పూర్తయింది.. షోరూం ప్రారంభమై కార్యకలాపాలు నిర్వహించడం కూడా గమనార్హం. ఇలా జిహెచ్ఎంసి టౌన్ ప్లానిం గ్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అడిగే నాథుడు లేకుండా పోయాడు. జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ విభాగం పై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చర్యలు తీసుకుంటాం
అక్రమ నిర్మాణాల విషయమై రాజేంద్రనగర్ సర్కిల్ ఏసీపీ శ్రీధర్ ను వివరణ కోరగా.. చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అన్నారు. సిబ్బంది కొరత కొంత సమస్యగా మారిందనితెలిపారు.