12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

శ్రీరంగం వెంచర్ యజమానికి నోటీసులు

30-08-2024 01:49 AM

చెరువులను సందర్శించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

మంచిర్యాల, ఆగస్టు 29 (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణలపై విజయక్రాంతి దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘శ్రీరంగం వెంచర్.. పొంచి ఉన్న డేంజర్’ కథనానికి అధికారులు స్పందించారు. గురు వారం మంచిర్యాల ఇరిగేషన్ ఏఈ గౌతమ్, తహసీల్దార్ రహ్ఫతుల్లా హుస్సేన్, ఆర్‌ఐ అజీజ్ చిన్నకుంట చెరువు కట్ట మీద, పెద్దకుంట చెరువు మధ్యలో నుంచి ‘శ్రీరంగం హీల్స్’ వేసిన కంకర రోడ్డును పరిశీలించారు. ‘విజయక్రాంతి’తో ఇరిగేషన్ ఏఈ మాట్లాడుతూ చెరువు కట్టపై ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డు వేశారని, చట్ట ప్రకారం అలా వేయరాదని, గతంలో హెచ్చరించామని, నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చెరువులను, కుంటలను కబ్జా చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.