15 March, 2026 | 7:17 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

నెన్నెలలో కడుపు నొప్పి తాళ లేక మహిళ ఆత్మహత్య

25-01-2026 06:19 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో కడుపు నొప్పి తాళలేక ఓ మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని నెన్నెల పోలీసులు ఆదివారం తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్ల సోమవారం గ్రామంలో దుర్గం సౌమ్య ను , గుండ్ల సోమారం గ్రామానికి చెందిన  కడుపు నొప్పి తాళలేక  ఈనెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది.

ఇంతలోనే ఇంటికి వచ్చిన సౌమ్య అత్తయ్య వసంత భర్త రాజ్ కుమార్, ఆడపడుచు కోట భాగ్య ఆమె భర్త మల్లేష్ సౌమ్య నోటి నుంచి నురగ రావడంతో వెంటనే ఆటోలో చికిత్స కోసం మంచిరాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. సౌమ్యకు బాబు, పాప ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.