08-11-2025 12:00:00 AM
జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ఇంటర్ విద్యలో ఉద్యోగుల కు ఇష్టానుసారంగా ఓడిలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఇస్తున్నారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.పీ.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా ఓడీ సౌకర్యానికి కమిషనర్ తెర తీశారని, ఉద్దేశ పూర్వకంగా ఇస్తున్నారా లేదో తెలియాల్సి ఉందన్నారు.
గతంలో క్యాన్సర్, గుండెపోటు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ఓడీలు ఇచ్చేవారని, ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైందని, నూతనంగా నియామకమైనన లెక్చరర్లతో సహా చాలామందికి ఓడి ఇవ్వడం వల్ల అనేక కాలేజీల్లో సిబ్బంది కొరత వెంటాడుతోందని తెలిపారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు కమిషనర్ ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.