08-11-2025 12:00:00 AM
జడ్చర్ల, నవంబర్ 7: అభివృద్ధి మా లక్ష్యం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీకి సంబంధించిన నూతన జెసిబి ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి పథకాలను ఆవిష్కృతం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీ జి.లక్ష్మా రెడ్డి , చైర్ పర్సన్ శ కోనేటి పుష్పలత, వైస్ చైర్ పర్సన్ పాలాది సారిక , గౌరవ కౌన్సిల్ సభ్యులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.