13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఐదింటిలో ఇచ్చింది ఒక్క ‘డీఏ’నే

13-01-2026 02:20 AM

ఎమ్మెల్సీ మల్క కొమరయ్య 

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను క్లియర్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం కేవలం ఒక్క డీఏనే ప్రకటించి చేతులు దులుపుకున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని బాధపడ్డారు. ప్రభుత్వం సోమవారం ఒక డీఏను విడుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ర్ట ప్రభుత్వం మిగిలిన డీఏల ఊసే ఎత్తకపోవడం, ముఖ్యంగా పీఆర్సీ మంజూరుపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

ప్రభుత్వం వెంటనే పీఆర్సీని మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలన్నింటినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒక డీఏ ఇచ్చినా, రేపోమాపో కేంద్రం జనవరి నెలకు గానూ కొత్త డీఏ ప్రకటిస్తుందని, దీంతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుందని ఆయన తెలిపారు. ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇస్తామనడం మంచిదే అయినా.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.