13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఉద్యోగుల డీఏ పెంపు హర్షనీయం

13-01-2026 02:23 AM

సీఎం రేవంత్‌రెడ్డికి టీఎన్జీవో ప్రత్యేక ధన్యవాదాలు

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) కేంద్ర సంఘం, హైదరాబాద్ జిల్లా యూనియన్ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మార్వం జగదీశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా డీఏ పెంపును ప్రకటించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్), టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఈ డీఏ పెంపు పట్ల తమ సంతోషాన్ని ప్రకటించారు.