calender_icon.png 13 May, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన గిరిజనులకు ప్రభుత్వం పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి

13-05-2025 12:20:05 AM

ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, మే 12 (విజయ క్రాంతి) అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. 

సోమవారం  ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం  ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలన్నారు.

గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు పొడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాల కొరకు, పట్టా భూములకు రైతుబంధు రుణాల కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వేసులుబాటు కల్పించుట కొరకు, ట్రైకార్ రుణాలు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, వ్యవసాయ భూములకు కరెంటు బోరు మోటార్ ఇప్పించుట కొరకు, గిరిజన భూములకు సౌర విద్యుత్ ద్వారా కనేక్షన్ ఇప్పించుట కొరకు, నూతనంగా చేపల సొసైటీలు ఏర్పాటు  కొరకు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఆర్.సి.ఓ గురుకులం అరుణకుమారి, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఎస్‌ఓ భాస్కరన్ , ఏపీ ఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవనాధికారి ఉదయ్, కొండ రెడ్ల అధికారి నరేష్, మేనేజర్ ఆదినారాయణ, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు, జేడీఎం హరికృష్ణ, హెచ్ ఈ ఓ లింగా నాయక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌమ్య,మరియు ఇతర విభాగాల సిబ్బంది జోగారావు, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.