30 June, 2026 | 9:51 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒకరికి గాయాలు

22-03-2025 12:00 AM

వెంకటాపురం/చర్ల, మార్చి 21 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం ముత్యం దార జలపాతం సమీపంలో బాంబు పేలుడు. పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను తొక్కి బొగ్గుల కృష్ణమూర్తి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు ఐయ్యాయి .బొంగు కర్రల కోసం అటవీకి ప్రాంతానికి వెళ్ళిన సమయంలో ప్రమాదం జరిగింది ,గాయపడిన వ్యక్తిని 108 ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

కాలు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేసారు మరో ముగ్గురు వ్యక్తులు దూరంగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. వెంకటా పురం వీరభద్రవరం  గ్రామ సమీపంలోని ముత్యం ధార జలపాతం సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అవటం జరిగింది బాధితుడు ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి నలుగురు యువకులు వెదురు బొంగుల కోసం అడవి ప్రాంతానికి వెళ్లిన నలుగురు గ్రామస్తులు తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.