3 July, 2026 | 8:30 PM

Breaking News

దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •  

ఆపరేషన్ కగార్‌ను ఆపివేసి శాంతి చర్చలు జరపాలి

01-05-2025 12:44 AM

ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు డిమాండ్ 

ఖమ్మం, ఏప్రిల్ 30  ( విజయక్రాంతి ):-మంచికంటి భవన్లో బుధవారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ’ఆపరేషన్ కగార్’ ను వెంటనే ఆపేయాలని, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని, అదేవిధంగా ఆపరేషన్ కర్రిగుట్టలు పేరుతో కొనసాగిస్తున్న కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలని వివిధ పార్టీలు, పౌర హక్కుల సంఘాలు కోరడం జరిగింది. శాంతీయుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలనీ, ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించి శాంతియుత వాతావరణం నెలకొల్పి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి.

రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. పారా మిలిటరీ బలగాలతో బల ప్రయోగంతో కాకుండా శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నాం. ఈ రౌండ్ సమావేశంలో మే 2న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించాలని, అన్ని మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రముఖ విద్యావేత్త రవి మారుత్, కాకి భాస్కర్, కిషన్ నాయక్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అన్ని ప్రధాన పార్టీల, అనుబంధ సంఘాలు, పౌర హక్కుల నాయకులు, విద్యావేత్తలు,తదితరులు పాల్గొన్నారు.