calender_icon.png 10 June, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులతో మన ప్రవర్తన మర్యాదగా ఉండాలి

05-06-2025 12:49:24 AM

కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి, జూన్ 4 (విజయక్రాంతి): ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులతో మన సిబ్బంది ప్రవర్తన మర్యాదగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హ ర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మంథని ఆసుపత్రి పని తీ రు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ మంథని ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ ఆశించిన స్థాయిలో ఉండటం లేదని తెలి పారు.  మాతా శిశు ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు పారిశుధ్య నిర్వహణ మెరుగు పర్చాలని లేని పక్షంలో. పారిశుధ్య కాంట్రాక్టర్ చెల్లింపులు నిలిపి వేయడం జరుగుతుందని,ఆసుపత్రి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని, ప్రజల తో సిబ్బంది చాలా దురుసుగా మాట్లాడుతున్నట్లు సమాచారం అందుతుందని, పని తీరు మార్చుకొని పక్షంలో  వేటు వేయడం జరుగుతుందని, ఆసుపత్రి విధులకు డాక్టర్లు సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో డి సి హెచ్ ఓ. శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.