14 June, 2026 | 4:20 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

జీవో 252పై అపోహలు వద్దు.. జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం

30-12-2025 11:54 AM

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పై నిందలు తగదు!

జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

​సంగారెడ్డి, (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులందరికీ బస్ పాస్ లు, హెల్త్ కార్డులు సహా అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ విభాగం నేతలు అనిల్ కుమార్, ఆసిఫ్ లతో కలిసి ఆయన మాట్లాడారు. 252 జీవో ద్వారా 13 వేల అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, తమ ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

డెస్క్ జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, గతంలో కేవలం కొందరికే కార్డులు ఉండేవని, ఇప్పుడు అందరికీ మీడియా కార్డులు అందేలా తమ సంఘం రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. ​నానాటికి అడుగంటుతున్న జర్నలిజం విలువలను పెంపొందించేందుకే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కట్టుదిట్టమైన నిబంధనలతో ఈ జీవో తెచ్చారని, ఆయనపై నిందలు వేయడం సరికాదన్నారు. జీవోలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందే వరకు ఐజేయు పోరాడుతుందని యాదగిరి స్పష్టం చేశారు.