calender_icon.png 21 October, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలక్ష్మీపురంలో గాలివానతో నేలకొరిగిన వరి

21-10-2025 07:06:26 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీనితో 150 ఎకరాలకు పైగా వరి పంట నేలకొరిగింది. దీనితో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పైరు నష్టపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం రాష్ట్రం ఉపాధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతాంగం కష్టాల్లో ఉందని వెంటనే ఆదుకోవాలని కోరారు.