17-08-2025 05:36:23 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వర్షాలకు బస్టాండ్ ఆవరణ బురదమయంగా మారి ప్రయాణికులు, బస్సులు వచ్చి వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని, సమస్య పరిష్కరించాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వరి నాట్లు వేసి ఎంసీపీఐ నాయకులు నిరసన తెలిపారు.