17-08-2025 06:27:12 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 19న జరగాల్సిన కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ (ఆదాని)సిమెంట్ కంపెనీ గుర్తింపు ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. 19న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన తొమ్మిది మంది కార్మికుల ఓట్లను తొలగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో 9 మంది కార్మికుల ఓట్లను తొలగించడం వెనక కారణాలు పరిశీలించేందుకు ఈ ఎన్నికలను కార్మిక శాఖ అధికారులు వాయిదా వేశారు. ఈనెల 26న కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ నిర్వహించే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో ఎన్నికల తేదీ మరోసారి వెల్లడి కానుంది.