25-04-2025 02:16:50 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇప్పటికే వీసా గడువులు తీరినా పాక్, బంగ్లాదేశ్లకు చెందిన పలువురు తమ దేశాలకు తిరిగే వెళ్లకుండా ఇప్పటికీ హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఓల్డ్ సిటీలో ఉంటున్న ఇతర దేశీయులను పోలీస్ యంత్రాంగం తరిమేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. దీని కోసం ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛనివ్వాలని కోరారు. ఎంఐఎం, బీఆర్ఎ స్ పార్టీతో కొంతకాలం దోస్తానా చేసిందని.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్తో కలిసి నడుస్తోందన్నా రు.
దీంతో ఈ అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు చాలా సందర్భాల్లో కనిపిస్తోందన్నారు. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నారని అనేక సందర్భాల్లో ఎన్ఐఏ, ఐబీ హెచ్చరికలు జారీచేశాయని గుర్తుచేశా రు.
వారికి రకరకాలుగా మద్దతిస్తూ, వారి గొంతుక గా నిలబెడుతున్న ఓ ఎంపీ వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయన్నారు. తక్షణమే ముందు జాగ్ర త్త చర్యగా హైదరాబాద్, పాతబస్తీలో అక్రమంగా నివాసముంటున్న స్లీపర్ సెల్స్ను ఏరిపారేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.