13-12-2025 06:37:47 PM
రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
జనగామ ఎమ్మెల్యే పల్లా
చేర్యాల: మద్దూరు మండలంలోని గ్రామాల్లో శనివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజే శ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా జరగలేదని చిన్న మురుగు కాలువలు,మట్టి రోడ్లు వేయ కపోవడం,వీధి దీపాలు వెలగకపోవడం,చెట్లకు నీళ్లు పోయకపోవడం,ట్రాక్టర్లు పనిచేయకపోవడం,మోరీలు తీయకపోవడం వంటి సమస్యలు గ్రామాలను వెంటాడుతున్నాయని అలాగే గ్రామీణ ప్రజానీకానికి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదని కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడం,పెంచుతామని చెప్పిన పింఛన్లు పెంచకపోవడం, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇవ్వకపోవడం,కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం,రైతు బంధు రూ.15 వేల వరకు పెంచుతామని చెప్పి అమలు చేయలేకపోవడం భీమా పథకాన్ని ఆపేయడం,యూరియా కొరత వడ్ల కొనుగోళ్లలో సమస్యలు రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఇలా అన్ని కారణాలతో గ్రామీణ ప్రజానీకం అల్లాడుతుంది అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రెండో దశ మూడో దశ ఎన్నికల్లో తగు బుద్ధి చెప్పాలని మద్యం,డబ్బు ప్రభావం,పోలీసుల బెదిరింపులు,అధికారుల ఒత్తిడితో మొదటి దశలో కొన్ని చోట్ల గెలిచిందని అయినప్పటికీ జనగామ,సిద్దిపేట జిల్లాల్లో పూర్తిగా బిఆర్ఎస్కు ప్రజలు మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు.ఏమి చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్ధులను తిరస్కరించే అవసరం ఉందని అన్నారు.హామీల అమలుకు పోరాడే బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చేర్యాల,మద్దూర్,దూల్మిట, కొమురవెల్లి మండల ప్రజలను ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.