calender_icon.png 7 June, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో అందే నాణ్యమైన విద్య పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి

06-06-2025 01:09:42 AM

పెద్దపల్లి, జూన్-5 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో అందే నాణ్యమైన విద్య పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలె క్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బడిబాట కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 10 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, 7 ఆదర్శ పాఠశాలలు, 361 ప్రాథమిక పాఠశాలలో, 83 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 104 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పరిధిలో విద్యా అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. బడి బాట కార్యక్రమం ద్వారా జూన్ 6 నుంచి జూన్ 19 వరకు ప్రభుత్వ పరిధిలో నడిచే వివిధ రకాల విద్యా సంస్థలో పిల్లలను జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో బడి బాట కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

గత సంవత్సరం బడిబాట కార్యక్రమం ద్వారా 2099 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని కలెక్టర్ గుర్తు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మొదటి  రోజే పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు. 10,186 మంది నిరక్షరాస్యులను ఉల్లాస్ కార్యక్రమం కింద రిజిస్ట్రేషన్ చేసి వారికి విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని,3 నుంచి 14 సంవత్సరాలు వరకు వయసు ఉన్నవారు తప్పనిసరిగా పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలని, ఆరోగ్య కారణాల వల్ల తీసుకోలేని పక్షంలో ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయించాలని అన్నారు.

15 సంవత్సరాల వయసు ఉన్న వారిచే ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లలకు నాణ్యమైన విద్య బోధన అందుతుందని, ప్రభుత్వం ఇటీవల ఖాళీలను సై తం భర్తీ చేసిందని, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా అవసరమైన మౌలిక వస్తువులు కల్పించామని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని,స్వశక్తి సహాయక సంఘాల సమావేశాల్లో కూడా బడిబాట గురించి చర్చించాలని కలెక్టర్ సూచించారు.

జూన్ 12 న జరిగే సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,గత సంవత్సరం హాజర శాతం అధికంగా ఉన్న విద్యార్థుల, మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ను పాఠశాల ప్రారంభం సందర్భంగా సన్మానించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల లక్ష్యాలు తల్లిదండ్రులకు స్పష్టంగా తెలిసేలా ముందు రోజే తెలియజేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి,జెడ్ పి సి ఓ. నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జి సి డి వో కవిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.