06-06-2025 01:10:10 AM
సీఎం రేవంత్రెడ్డిపై హరీశ్రావు ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 5 (విజయ క్రాంతి): ఇంకా ఎన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడతవ్ సీఎం రేవంత్రెడ్డి అంటూ మాజీమంత్రి హరీశ్రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చ ట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్య తను సీఎం భుజాన వేసుకున్నారని మండిపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహి తంగా దాడి చేయడం అమానుషమని విమర్శించారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే రేవంత్ రెడ్డి తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా స్పం దించరా అని ప్రశ్నించారు.
పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మం ది రిమాండ్కు పంపించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయని ప్రశ్నించారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదన్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతుల ను కొట్టారని గుర్తు చేశారు. జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్ష ణా రహితంగా దాడి చేసి అక్రమ కేసు లు పెట్టించారని, సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మం దిపై కేసులు పెట్టి పోలీస్ జులుం చూపించారని గుర్తు చేశారు.