calender_icon.png 7 June, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

06-06-2025 01:09:28 AM

చేగుంట, మే 5, విజయక్రాంతి : మెదక్ జిల్లా జాతీయ రహదారి 44పై చేగుంట మండలం వడియారం క్రాస్ రోడ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తీగల యాదగిరి (49), అతని భార్య తీగల మంజుల (45) తమ సొంత వాహనమైన టీవీఎస్ ఎక్సెల్ పై చేగుంట వైపు వెళ్తుండగా వడియారం క్రాస్ రోడ్ వద్ద హైదరాబాదు నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న గూడ్స్ ట్రాలీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మంజులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు చేగుంట పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తూప్రాన్ డిఎస్పి నాగేందర్ గౌడ్, చేగుంట ఎస్త్స్ర చైతన్య రెడ్డి, బ్లూ కోర్స్ సిబ్బంది చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.