calender_icon.png 29 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీ రోగులకు పింఛన్లు

29-06-2025 02:31:00 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): కిడ్నీ రోగుల బాధలు మామూలుగా ఉండవు. క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకోకుంటే వారి జీవితాలకు గ్యారెంటీ ఉండదు. అలాంటి 900 మంది కిడ్నీ రోగులకు నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డా. శ్రీభూషణ్ రాజు బృందం చేసిన సాయం వల్ల రూ. 2016 నెలవారీ పించన్లు అందుతున్నాయి. వీరి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించి అనేకసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపడం వల్లే ఇది సాధ్యమైంది.

ఈ నేపథ్యంలో డా. శ్రీభూషణ్ రాజు, డా. గంగాధర్, డా. స్వర్ణలత, పీఆర్‌ఓ సత్య గౌడ్‌లను నిమ్స్ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్ప సహా నిమ్స్ వైద్య బృందానికి కిడ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. నిమ్స్ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.