9 May, 2026 | 9:49 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ప్రజల ప్రభుత్వం.. కాంగ్రెస్ సర్కార్

16-08-2024 02:06 AM

రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, ఆగస్టు 15(విజయక్రాంతి): ప్రజల సర్కార్.. కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఆమె స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం ఆమె ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు.