9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మండలి, అసెంబ్లీలో స్వాతంత్య్ర సంబురం

16-08-2024 02:10 AM

జెండా ఎగురవేసిన చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్‌కుమార్

హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఆసెంబ్లీ ఆవరణలోఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రఘోత్తమ్‌రెడ్డి, దయానంద్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.