15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శిశుమందిర్ రోడ్డు బాధితుల ఆందోళన

20-11-2025 07:44 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శిశుమందిర్ రోడ్డు విస్తరణ బాధితులు గురువారం రాత్రి రోడ్డుకు అడ్డంగా కూర్చొని ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గత 70 ఏళ్లుగా ఇదే రోడ్డుపై నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనాన్ని పొందుతున్న తమకు రోడ్డు విస్తరణ పనులు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధిని దెబ్బతీసే విస్తరణ పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అభివృద్ధి పేరిట జీవనోపాధిని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటలకు పైగా శిశుమందిర్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. బాధితుల ఆందోళనతో చిన్నభూధ, బెల్లంపల్లి వైపుకు వాహనాలు ఇక్కడిక్కడ నిలిచిపోయాయి. గొడవ జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. మున్సిపల్ అధికారులతో చర్చించి ఆందోళన విరమించాలని సూచించినప్పటికీ వారు వినలేదు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మున్సిపల్ సిబ్బంది తెలపడంతో వారు ఆందోళన విరమించారు.