calender_icon.png 29 October, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేయుసీఐఎస్ రవికుమార్

29-10-2025 08:01:25 PM

హనుమకొండ/కెయు,(విజయక్రాంతి): మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేయూ ఇన్ స్పెక్టర్ సుంకరి రవి కుమార్ సూచించారు. ఈ సందర్భంగా బుధవారం కేయూ ఇన్ స్పెక్టర్  సుంకరి రవి కుమార్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ మొంథా తుపాన్ నేపథ్యంలో చెరువులు మత్తడి పొంగే అవకాశం ఉందని, వాగులు పొంగే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు, వాహన దారులు మత్తడి వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు.

వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు డ్రైనేజీలు, గుంతలు గమనించాలని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు క్షేమంగా ఉండాలని పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని గుర్తు చేశారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని లేకుంటే ఇంటిలోనే ఉండాలని కోరారు. పిల్లలను బయటకు రాకుండా చూడాలని వర్షం పడేటప్పుడు ప్రజలు కరెంట్ స్తంభాలను తాకాకూడదన్నారు. మీ రక్షణ మా బాధ్యత అని అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి ఫోన్ చేయాలని ఇన్స్పెక్టర్ రవి కుమార్ సూచించారు.