23-06-2025 07:07:03 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ డిపో కండక్టర్ వాజిత్(RTC depot conductor Wajith) సోమవారం తన నిజాయితీని చాటుకున్నారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ లో గంగా ప్రసాద్ ల్యాప్టాప్ మరిచి పోచంపాడులో దిగిపోయారు. నిజామాబాద్ వెళ్లిన తర్వాత కండక్టర్ కు ల్యాప్ టాప్ కనిపించడంతో దాన్ని నిర్మల్ బస్టాండ్ తీసుకొచ్చి ఆర్టీసీ సిబ్బంది సహకారంతో గంగా ప్రసాద్ కు సమాచారం అందించి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసి సిబ్బందిని నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) అభినందించారు.