11 April, 2026 | 3:55 PM

Breaking News

కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి   •   బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •  

చెండే వాయిద్యాన్ని అవమానిస్తే పీటర్ ఊరుకోడు!

03-11-2025 02:38 AM

రాజేశ్ ధ్రువ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజాచిత్రం ‘పీటర్’. సుకేశ్ శెట్టి రచనాదర్శకత్వంలో సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేశ్ హెగ్గడే నిర్మిస్తున్నారు. జాన్వి రాయల, రవిక్ష శెట్టి ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే..

కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన డైలాగులు ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి. ఇందులోని విజువల్స్, నేపథ్య సంగీతం అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: గురుప్రసాద్ నార్నాడ్; సంగీతం: రిత్విక్ మురళీధర్; ఎడిటర్: నవీన్ శెట్టి; ఆర్ట్: దేవరాజ్.