calender_icon.png 4 November, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస బస్సు ప్రమాదాలు నన్ను కలవరపరుస్తున్నాయి: బండి సంజయ్

04-11-2025 09:11:43 AM

  • హైదరాబాద్: కరీంనగర్ జిల్లా(Karimnagar District) తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట బ్రిడ్జిపై వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు వడ్లలోడు ట్రాక్టర్ ను వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి ప్రయాణికులకు గాయాలు కాగా, తక్షణమే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ వరుస బస్సు ప్రమాదాలు తనను కలవర పరుస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) అన్నారు. మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద జరిగిన బస్సు-ట్రాక్టర్ ప్రమాదం బాధాకరమని బండి సంజయ్ పేర్కొన్నారు.

  • విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పత్తితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో, పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్న బండి సంజయ్ అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మెట్పల్లి డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న గాయపడిన 15 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేంద్రమంత్రి  తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై  ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు.