23-06-2025 06:58:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సోమవారం ఫిజియోథెరపీ పరీక్షలను నిర్వహించారు. భవిత పాఠశాల(Bhavitha School)లో చదువుతున్న పిల్లలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఫిజియోథెరపీ పరీక్షల ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడే విధానంపై అవగాహన కల్పించారు. మొత్తం 200 మంది పిల్లలకు ఈ పరీక్షలు నిర్వహించినట్టు సమన్వయకర్త నరసయ్య నిర్వాహకులు ప్రవీణ్ కుమార్, నాగేశ్వరరావు, వైద్యులు ఆల్ఫా ఉద్దీన్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.