16-12-2025 01:09:07 PM
పెట్టుబడులకు భారత్ మరింత ఉపయుక్తం
అమ్మాన్: ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్లో పర్యటించారు. అమ్మాన్(Amman)లో భారత్-బోర్డాన్ బిజినెస్ ఫోరంలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మార్కెట్లు మరింత పుంజుకోవడానికి బోర్డాన్ సహకరిస్తోందని తెలిపారు. ఇరు దేశాల బంధాలు.. సుదీర్ఘకాలం బలోపేతానికి చర్యలు చేపట్టారు. ఇరు దేశాల అభివృద్ధి, అవకాశాలపై దృష్టి సారించారు. పెట్టుబడులకు భారత్ మార్కెట్ మరింత ఉపయుక్తం అన్నారు. భారత వృద్ధిరేటు 8 శాతానికి పైగా ఉందని తెలిపారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.