13 June, 2026 | 2:03 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

జాకోర, చందూర్ ఎత్తిపోతల పంపు మోటార్ల ట్రయల్ రన్ చేసిన పోచారం

11-04-2026 02:18 AM

బాన్సువాడ, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియా 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి 106 కోట్లతో నిర్మించి త్వరలో ప్రారంభించనున్న వర్ని మండలం జాకొర,చందూర్ ఎత్తిపోతల పథకాల పంపు మోటార్ల ట్రయల్ రన్ ను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు.

సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారులు పెంటారెడ్డి గారు, ఇరిగేషన్ CE శ్రీనివాస్ వర్ని,చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇరిగేషన్ అధికారులు,రైతులు పాల్గొన్నారు.