15 March, 2026 | 7:32 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

పతంగులు ఎగురవేసిన పోచారం

14-01-2026 05:37 PM

తెలుగువారి సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ

బాన్సువాడలో  కైట్ ఫెస్టివల్లో పాల్గొని పతంగులు ఎగురవేసిన పోచారం, కాసుల

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండగ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా  బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ)లో పాల్గొని పట్టణ వాసులు, చిన్నారులతో కలిసి కైట్ (పతంగి) ను ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజా ప్రతినిధులతో కలిసి పతంగులను ఎగరవేశారు.

చిన్నారితో కలిసి గాలిపటాలని ఎగరవేయడం చాలా సంతోషంగా ఉందని కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు చిన్నారులు తదితరులు ఉన్నారు.