17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రజల రక్షణకే పోలీస్

31-10-2025 12:00 AM

పోలీస్ అమరుల సంస్కరణ వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ: ఎస్పీ శరత్‌చంద్ర పవర్

నల్గొండ క్రైమ్, అక్టోబర్ 30: ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణ త్యాగానికి సిద్ధపడతారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీనీ ప్రారంభించి న అనంతరం ఆయన మాట్లాడారు.పోలీస్ విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ప్లాగ్ డే నిర్వహిస్తున్నామనీ, వారి త్యాగాల గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. 

శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన వారి ఆత్మ శాంతి కలగాలన్నారు. జిల్లా పోలీస్ ప్రజా రక్షణే ద్వేయంగా అనుక్షణం శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహా లక్ష్మయ్య శ్రీను నాయక్ ఆర్ ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు ఎస్త్స్రలు సైదులు, శంకర్, గోపాల్ రావు, వీరబాబు, శ్రావణి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.