22 June, 2026 | 7:52 PM

Breaking News

కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •  

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

31-10-2025 01:50 AM

బూర్గంపాడు,అక్టోబర్30,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఓపి రూము, పేషెంట్లకు సరిపడా బెడ్లు అందుతున్న వైద్యం, మంచినీటి సౌకర్యం, వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, ప్రతిరోజు రోగుల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మండల కేంద్రానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందాలని,108 అం బులెన్స్ సౌకర్యం, సరిపడా మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నిల్వ ఉంచుకోవాలని, వైద్యులు సమయపాలన పాటించి నిత్యం వైద్య వృత్తి సేవగా చేసే విధంగా డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

స్వయంగా తాను బిపి మిషన్ ద్వారా పరీక్ష చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా తాను బ్లడ్ తీయించుకొని రక్త పరీక్షలు చేయించుకోవటం పట్ల రోగులకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో స్వయంగా పర్యవేక్షణ ద్వారా తె లుసుకున్నారు.డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు.