02-12-2025 05:44:52 PM
బైంసా (విజయక్రాంతి): బైంసా పట్టణంలో బుధవారం పోలీసుల ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఏఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని ఆమె పేర్కొన్నారు.