5 June, 2026 | 8:50 PM

Breaking News

భిక్కనూరు పశువైద్య అధికారిగా డాక్టర్ మౌనిక   •   పర్యావరణం బాధ్యత.. ప్రతి ఒక్కరు బాధ్యత   •   తేజస్ అకాడమీ విద్యార్థులకు డిఫెన్స్ లో ఉద్యోగాలు   •   అంజనాపురం పాఠశాలకు రాష్ట్ర ఉత్తమ పర్యావరణ పాఠశాల అవార్డు   •   టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి   •   అమేజింగ్ ఇండియన్: మాచన రఘునందన్   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం   •   సీడ్స్ కేంద్రాలను తనిఖీ చేసిన గరిడేపల్లి ఎస్ఐ   •   డ్రంక్ అండ్ డ్రైవ్ లో రూ.3 లక్షలు జరిమానా   •   రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుపై కాంగ్రెస్ కు లేదు   •  

బంగారం కోసం ఇంటి ఓనర్‌ హత్య

30-12-2025 10:47 AM

నాచారంలో దారుణం.. 

యజమానిని హత్య చేసిన ముగ్గురు యువకులు..

హైదరాబాద్: నాచారం పరిధిలో మిస్సింగ్ కేసును(Nacharam missing case) పోలీసులు చేధించారు. మహిళను హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం కోసం ఇంటి యజమానిని నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. సుజాత అనే మహిళ మల్లాపూర్ లో ఒంటరిగా నివసిస్తోంది. సుజాత ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజిబాబు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 24న సుజాత కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అంజిబాబు బంగారం కోసం హత్య చేసినట్లు గుర్తించారు. స్నేహితులు యువరాజు, దుర్గారావు సాయంతో అంజిబాబు నేరం చేసినట్లు వెల్లడించాడు. సుజాత మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణ లంకకు తరలించి గోదావరిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అంజిబాబుకు సహకరించిన స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.