10-08-2025 07:13:34 PM
కొండాపూర్: కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 11వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున ఈ అంతరాయం కలుగుతుందని ఏడీ వీరారెడ్డి, ఏఈ సిద్దిరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.