6 July, 2026 | 3:58 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

రహదారిపై పడిన భారీ వృక్షం తొలగింపు

10-08-2025 07:18 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం తొగ్గూడెం గ్రామానికి వెళ్లే రహదారిపై భారీ వృక్షం ఒకటి గాలి వానకు నేలకూలి రహదారిపై పడింది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి సొంతంగా ఖర్చులు భరించి మిషన్లతో చెట్లను తొలగించి, రహదారిపై అడ్డంగా పడి రాకపోకలను పునరుద్ధరించారు. వారిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు కొప్పులరాంబాబు, సున్నం నాగేష్, కారం రాజు, శ్రీను, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సున్నం నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.