02-06-2025 02:16:32 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ జూన్ 1 (విజయ క్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం జూన్ 2 వ తేదీ న రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 2 న తెలంగా ణ అవతరణ దినోత్సవం వేడుకలు కార్యక్రమం నిర్వహిస్తున్నందున, సోమవారం నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని పేర్కొన్నారు.